‘మ్యాచ్ పూర్తయ్యాక మనం గెలిచేందుకు అన్ని విధాల అర్హులమని కోచ్కు చెప్పాను. అంతేకాకుండా సూపర్ చివరి బంతికి కోచ్తో స్టంప్స్ కొట్టేది (విజయం మనదే) మనమే అని చెప్పా. రోహిత్ శర్మ రూపంలో టీమిండియాలో ఓ అద్భుతమైన ఆటగాడు ఉన్నాడు. మేము ఓ దశలో మ్యాచ్పై పట్టు కోల్పోయాం. అయితే షమీ చివరి ఓవర్ అదేవిధంగా లాస్ట్ బంతి ఇంకా నా ముందు తిరుగుతోంది. షమీ చివరి రెండు బంతి డాట్ బాల్స్ చేశాక సూపర్ ఓవర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఇక సూపర్ ఓవర్లో ప్రపంచంలోనే డెత్ ఓవర్ స్పెషలిస్టుగా పేరుగాంచిన బుమ్రా బౌలింగ్లో విలియమ్సన్ బౌండరీలు రాబట్టాడు. విలియమ్సన్ బ్యాటింగ్ సూపర్బ్. ఇక ఈ విజయంతో రిజర్వ్ బెంచ్పై కూర్చొన్న నవదీపై సైనీ, వాషింగ్టన్ సుందర్లకు తర్వాతి మ్యాచ్లో ఆడేందుకు మార్గం సుగమమైంది’ అని సారథి విరాట్ కోహ్లి పేర్కొన్నాడు.
‘సూపర్’ విజయంపై కోహ్లి, రోహిత్ల స్పందన!